తెలంగాణ

రేవంత్ యాత్ర నేటితో పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 29: రైతుల సమస్యలపై టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఈ నెల 6న చేపట్టిన ‘రైతు పోరు యాత్ర’ బుధవారం (30న) ముగియనున్నది. ఈ నెల 6న భూపాల్‌పల్లి జిల్లా నుంచి మొదలైన రైతు పోరు యాత్ర వైరా, ఖమ్మం, పెద్దపల్లి, సూర్యాపేట, నల్లగొండ మీదుగా సాగింది. ప్రతి రోజూ 15 నుంచి 20 కిలో మీటర్ల వరకు పాదయాత్ర చేసి గ్రామీణ ప్రజలను, రైతులను కలిసి వారి సమస్యలు తెలుసుకున్నారు. తెలంగాణ రైతులు ఆనందంగా ఉన్నారని, దావత్‌లు చేసుకుంటున్నారని ముఖ్యమంత్రి కెసిఆర్ చేసిన వ్యాఖ్యల గురించి రేవంత్ రెడ్డి రైతుల వద్ద ప్రస్తావించి వారి అభిప్రాయాలు సేకరించారు.
బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి మండల కేంద్రంలో జరగనున్న సభలో రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు.