తెలంగాణ

రూ.58 లక్షల కొత్త నోట్లు స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 5: లెక్కల్లో చూపని రూ.58లక్షల కొత్త నోట్లను దక్షిణ మండలం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 30 శాతం కమీషన్‌తో పాత నోట్ల స్థానంలో కొత్తనోట్లను మార్పిడి చేసేందుకు యత్నించిన 8 మందిని అరెస్టు చేసినట్లు దక్షిణ మండలం డిసిపి వి.సత్యనాయణ తెలిపారు. సంతోష్‌నగర్ పోలీస్టేషన్ పరిధిలో నోట్లు మార్పిడి జరుగుతున్నట్టు తమకు వచ్చిన సమాచారం ఆధారంగా నిఘాను ముమ్మరం చేసి ఈ ముఠాను పట్టుకున్నామన్నారు. కడపకు చెందిన జీరెడ్డిగోవర్ధన్‌రెడ్డి, పిబి ముణిరెడ్డి, టిఆర్ మోహన్‌రెడ్డి, ఎన్.గురుమోహన్‌రెడ్డి, కర్నూలుకు జిల్లాకు చెందిన ఎం.నాగేంద్ర, నల్గొండకు చెందిన రవీంద్రచారి, ఎల్‌బి నగర్‌కు చెందిన మంజిమేట శశివర్ధన్‌రెడ్డిలను అరెస్ట్ చేశారు. నోట్ల మార్పిడిలో పాలుపంచుకునే వారు ఎంతటివారైనా చట్టపరంగా చర్యలు తప్పవని డిసిపి హెచ్చరించారు.