తెలంగాణ

జయ అంత్యక్రియలకు రాష్ట్ర మంత్రులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 6: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అంత్యక్రియల్లో పాల్గొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, నాయిని నర్సింహ్మారెడ్డి మద్రాస్ వెళ్లారు. అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి చెప్పడంతో ఈ ఇద్దరు మంత్రులు వెళ్లారు.
జయలలిత మృతికి పలువురు మంత్రులు సంతాపం తెలిపారు. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన చలన చిత్ర అభివృద్ధి మండలి సమీక్షా సమావేశంలో జయలలిత మృతికి సంతాపం తెలిపారు. చలన చిత్ర రంగంలో, రాజకీయ రంగంలో జయలలిత తనదైన ముద్ర వేశారని తలసాని అన్నారు. తమిళనాడు పేద ప్రజల అభివృద్ధికి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన పేదల పెన్నిధి జయలలిత అని తలసాని ఆమె సేవలను కొనియాడారు. జయలలిత ఆత్మకు శాంతి చేకూరాలని అన్నారు.