తెలంగాణ

సీడ్ కంపెనీల ఆస్తులను జప్తు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 19: విత్తన కంపెనీల ఆస్తులను జప్తు చేయాలని రాష్ట్ర హైకోర్టును టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. విత్తన కంపెనీలు నకిలీ విత్తనాలను సరఫరా చేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, కొంత మంది ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారని ఆయన పిటీషన్‌లో పేర్కొన్నారు. నకిలీ విత్తనాల వల్ల వేలాది ఎకరాల్లో పంట నష్టపోయిందని చెప్పారు. నకిలీ విత్తనాలను సరఫరా చేసిన కంపెనీలను పిడి యాక్టు కిందకు తీసుకువచ్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని రేవంత్‌రెడ్డి తన పిటిషన్‌లో పేర్కొన్నారు.