తెలంగాణ

నోట్ల రద్దుపై ఉద్యమించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 20: చిల్లరనోట్ల కష్టాలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో గ్రామాలనుంచి ఉద్యమం చేపట్టాలని ఎఐసిసి కార్యదర్శి రామచంద్ర కుంతియా కార్యకర్తలను కోరారు. మంగళవారం గాంధీభవన్‌లో జరిగిన పార్టీ నేతల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రం పెద్దనోట్లను రద్దుచేసి అనాలోచిత నిర్ణయం తీసుకుందన్నారు. దీనిపై గ్రామస్థాయ నుంచి ఉద్యమం చేపట్టాలని పిలుపునిచ్చారు. పెద్దనోట్ల రద్దు నల్లకుబేరులకు లాభం చేసే విధంగా ఉందన్నారు. 45 రోజులుగా చిల్లర కష్టాలతో ప్రజలు సతమతమవుతుంటే, కేంద్రం చోద్యం చూస్తోందన్నారు. నల్ల కుబేరులతో కేంద్రంలోని పెద్దలకు సంబంధాలు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి ఉపాధ్యక్షులు మల్లు రవి, డిసిసి అధ్యక్షులు, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి మహేష్ కుమార్ గౌడ్ , పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు.