రాష్ట్రీయం

మా రెండు జిల్లాలను కలిపితే బాగుండేది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 21: పార్టీలకు అతీతంగా అందరితో కలుపుగోలుగా కలిసిపోయే ఆంధ్ర రాష్ట్రంలోని అనంతపురం జిల్లా టిడిపి ఎంపి జెసి దివాకర్ రెడ్డి బుధవారం తెలంగాణ అసెంబ్లీ లాబీల్లో హల్‌చల్ సృష్టించారు. ఆయన ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌తో కొంత సేపు ముచ్చటించారు. ‘రాష్ట్ర విభజన వల్ల అనంతపురం, కర్నూలు జిల్లాలకు తీరని అన్యాయం జరిగింది. విభజన సమయంలో మా రెండు జిల్లాలను కలుపుకోవాలని కోరాం. ఈ రెండు జిల్లాలకు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీళ్లు రావాలి. ఈ రెండు జిల్లాలను తెలంగాణలో విలీనం చేసి ఉంటే, ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావును కలిసి మాకు నీరు విడుదల చేయాలని కోరే వారం. ఇప్పుడు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఈ రెండు జిల్లాల వ్యవసాయ మనుగడ ఆధారపడి ఉంది. విభజన వల్ల ఈ రెండు జిల్లాల పరిస్థితి అధ్వాన్నంగా తయారయింది’ అన్నారు. ఆ తర్వాత ప్రతిపక్ష నేత కె జానారెడ్డిని కూడా జెసి దివాకర్ రెడ్డి కలుసుకున్నారు. కాంగ్రెస్ నేతలతో సరదాగా మాట్లాడారు. జానారెడ్డిని ఉద్దేశించి జెసి మాట్లాడుతూ మీరు ప్రభుత్వంపై పోరాటం ఉధృతం చేయాల్సి ఉందని, మీరు గట్టిగా నిలబడాలని కోరారు.