తెలంగాణ

రాష్టప్రతి, గవర్నర్, సిఎం క్రిస్మస్ శుభాకాంక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 24: రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ, ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, ఎంపి కవిత, పలువురు మంత్రులు క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
సంతోషకరమైన క్రిస్మస్ పర్వదినం సందర్భంగా దేశంలోని క్రైస్తవులు, విదేశాల్లో నివసిస్తున్న దేశ పౌరులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అని రాష్టప్రతి ఒక ప్రకటనలో తెలిపారు. క్రిస్మస్ స్ఫూర్తి మన హృదయాలను ప్రేమతో, కరుణతో నింపాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. ప్రభువు ఏసుక్రీస్తు దివ్య బోధనలు మానవ జాతి సంక్షేమం కోసం అత్యుత్తమ కృషి అని అన్నారు. సేవాతత్పరతను బోధించిన క్రీస్తు జన్మదినం యావత్ మానవ జాతికి సంతోషకరమైన రోజు అని ముఖ్యమంత్రి అన్నారు. ప్రజలు ఆనందోత్సవాల మధ్య పండుగ జరుపుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. మానవాళి పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, అకాశమంతటి సహనం, అవధులు లేని త్యాగం శాంతియుత సహజీవనం ఇదీ జీసస్ మానవాళికి ఇచ్చిన సందేశం అని ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తెలిపారు.