తెలంగాణ

మహబూబాబాద్ జిల్లాలో విషాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గంగారం, డిసెంబర్ 25: అభం శుభం తెలియన ఐదేళ్ల చిన్నారి చలిమంట కాచుకోబోయి ఆ మంటకే బలి అయిన సంఘటన ఆదివారం మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం జంగాలపల్లిలో చోటుచేసుకుంది. గ్రామస్థుల కథనం ప్రకారం.. జంగాలపల్లి తండాలో ఈస్లావత్ భిక్షపతి, సునీత దంపతులకు ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. చలి విపరీతంగా ఉండడంతో ఇంటికి దగ్గర్లో చలిమంట వేసుకున్నారు. మంట దగ్గరకు చుట్టుపక్కల పిల్లలంతా చేరి చలి కాచుకునే క్రమంలో భిక్షపతి కూతురు రమ్యశ్రీ (5) బట్టలకు నిప్పు అంటుకొని క్షణాల్లో నిప్పు మంటగా మారింది. అక్కడ ఉన్న మిగతా పిల్లలు భయంతో కేకలు వేస్తూ పెద్దలకు చెప్పేసరికే రమ్యశ్రీ బట్టలన్నీ కాలిపోయి బాధతో కేకలు పెడుతూ కడుపు ఉబ్బి చనిపోయింది. అప్పటిదాకా తమతో ఉన్న చిన్నారి చలిమంటకు బలైపోవడంతో తోటి పిల్లలు, తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.