తెలంగాణ

జానా ఇంటికి భోజనానికి వెళ్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 27: ప్రతిపక్ష నాయకుడు కె జానారెడ్డి ఇంటికి తాను భోజనానికి వెళతానని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలిపారు. రాష్ట్రంలో గతంలో ఇలాంటి సంప్రదాయం ఉండేదని అన్నారు. నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో పుచ్చలపల్లి సుందరయ్య ఇంటికి వెళ్లి మాట్లాడేవారని ఇది మంచి సంప్రదాయం అని కెసిఆర్ అన్నారు. అదే విధంగా తాను కూడా ప్రతిపక్ష నాయకుడు కె జానారెడ్డి ఇంటికి వెళ్లాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నట్టు చెప్పారు. ఇంతలో ఉప ఎన్నికలు రావడంతో, మరో రకంగా ప్రచారం చేస్తారనే ఉద్దేశంతో వెళ్లలేదని, ఇప్పుడు వెళతానని కెసిఆర్ తెలిపారు. మంగళవారం శాసనసభలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణంపై లఘు చర్చ జరిగింది. మధ్యాహ్నం 3.30 తరువాత కూడా చర్చ సాగుతుండడడం, ముఖ్యమంత్రి కెసిఆర్ వివరంగా సమాధానం చెప్తుండటంతో ప్రతిపక్ష నేత కె జానారెడ్డి కల్పించుకుని ముఖ్యమంత్రి భోజనం చేసి వచ్చినట్టుగా ఉన్నారు, నన్ను పిలవలేదు, పిలిస్తే వెళ్లేవాణ్ణి అంటూ చమత్కరించారు. వెంటనే ముఖ్యమంత్రి కెసిఆర్ లేచి, నిజానికి తానే జానారెడ్డి ఇంటికి భోజనానికి వెళ్లాలని అనుకున్నానని, వెళతానని చెప్పారు. జానారెడ్డి ఇంటికి వెళ్లి పులుసన్నం పెడితే తినేసి వస్తానని అన్నారు.