తెలంగాణ

తెలంగాణ ఎబివిపి అధ్యక్షుడిగా చెన్న క్రిష్ణరెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 30: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఎబివిపి) తెలంగాణ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా డాక్టర్ చెన్నక్రిష్ణరెడ్డి ఎన్నికయ్యారు. ఇండోర్‌లో జరిగిన జాతీయ మహాసభల్లో రాష్ట్ర మహాసభలను నిర్వహించి కొత్త కార్యవర్గాన్ని ఎంపిక చేశారు. తెలంగాణ రాష్ట్రం నుండి 450 మంది ప్రతినిధులు ఈ మహాసభల్లో పాల్గొన్నారు. రాష్ట్ర కార్యదర్శిగా ఎల్ అయ్యప్ప, ఉపాధ్యక్షులుగా కె బాల్‌రాజ్, రావుల కృష్ణ, సౌమ్య, శ్రీకాంత్ ఎన్నికయ్యారు. సంయుక్త కార్యదర్శులుగా మహేష్ , జగదీష్, రాజు నాయక్, రత్నమాల, సంపత్ ఎన్నికయ్యారని ప్రాంత కార్యాలయ కార్యదర్శి ఎస్ రాజశేఖర్ చెప్పారు. సహసంఘటనా కార్యదర్శిగా నిరంజన్, కోశాధికారిగా లింబాద్రి, టెక్నికల్ సెల్ కన్వీనర్‌గా ప్రవీణ్, వనవాసి కన్వీనర్‌గా రమేష్, ఎస్‌ఎఫ్‌డి కన్వీనర్‌గా బ్రహ్మచారి నియమితులయ్యారు.