రాష్ట్రీయం

రాష్టప్రతి నిలయంలో తేనీటి విందు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 30: సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్టప్రతి నిలయంలో శుక్రవారం తేనీటి విందు కార్యక్రమం జరిగింది. శీతాకాల విడిది కోసం వారం రోజుల కిందట హైదరాబాద్‌కు వచ్చిన రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ పర్యటన ముగిసిన సందర్భంగా ఏర్పాటు చేసిన ‘ఎట్ హోం’ (తేనీటి విందు) కార్యక్రమానికి గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ దంపతులు, ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ డాక్టర్ చక్రపాణి, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పుర ప్రముఖులు హాజరయ్యారు.

చిత్రం.. శుక్రవారం బొల్లారంలోని రాష్టప్రతి నిలయంలో ఏర్పాటు చేసిన తేనేటి విందులో ప్రణబ్‌ముఖర్జీకి నముస్కరిస్తున్న మండలి చైర్మన్ స్వామిగౌడ్. చిత్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్, గవర్నర్ సతీమణి ఉన్నారు.