తెలంగాణ

సంక్షోభంలో ప్రజా సంక్షేమం: టిడిపి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 2: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్లక్ష్యం కారణంగా ప్రజా సంక్షేమం సంక్షోభంలో పడిందని టిడిపి టిఎస్ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు పి. సాయిబాబా విమర్శించారు. దేశంలో రెండో ధనిక రాష్ట్రం తెలంగాణ అని ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పినప్పటికీ అభివృద్ధిలో వెనుకబడిందని ఆయన సోమవారం విలేఖరులు సమావేశంలో విమర్శించారు. దివ్యాంగుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు శూన్యమని ఆయన అన్నారు. పాలకుల నిర్లక్ష్యంతో రోడ్ల మీద యాచకులుగా మారే పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 9 లక్షలకు పైగా దివ్యాంగులు ఉంటే అందులో 6,12,192 మందిని మాత్రమే అర్హులుగా గుర్తించి వారిలో 3 లక్షల 42 వేల మందికి పెన్షన్లు ఇస్తున్నారని ఆయన తెలిపారు.