తెలంగాణ

చేనేత కొనుగోళ్లు చేసిన కవిత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 6:అసెంబ్లీ లాబీలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్రాల స్టాల్‌ను ఎంపి కవిత సందర్శించారు. చేనేతకు ప్రోత్సహించడానికి, ప్రచారం కల్పించడం కోసం 40వేల రూపాయల విలువైన చేనేత వస్త్రాలు కొనుగోలు చేశారు. డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి జన్మదినం సందర్భంగా అమె కోసం, తన తల్లి కోసం వస్త్రాలు కొన్నట్టు చెప్పారు. డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి లాబీలో జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేశారు. కవిత పద్మకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. కరీంనగర్ జడ్‌పి చైర్‌పర్సన్ తుల ఉమ, ఎమ్మెల్యేలు బొడిగె శోభ, గీతారెడ్డి, డికె అరుణ, మాజీ ఎమ్మెల్యేలు సత్యవతి రాథోడ్‌లు కవితతో పాటు చేనేత వస్త్రాల స్టాల్‌కు వచ్చారు.
ఐటి శాఖ మంత్రి కెటిఆర్ రెండు రోజుల క్రితం శాసన సభ్యులందరికీ చేనేత వస్త్రాలు బహూకరించారని శాసన సభలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డికె అరుణ, పద్మ తెలిపారు. చేనేతను ప్రోత్సహించేందుకు కెటిఆర్ వస్త్రాలు బహూకరించడం పట్ల ఎమ్మెల్యేలు అభినందనలు తెలిపారు.