తెలంగాణ

మహిళా దినోత్సవం రోజునే నిర్భయ కేసు నమోదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేరేడుచర్ల: సభ్యసమాజం తలదించుకునేలా ఏడేళ్ల బాలికపై అత్యాచారయత్నం జరిపిన వ్యక్తికి మహిళా దినోత్సవం రోజైన మంగళవారం నిర్భయ కేసు నమోదైంది. నల్లగొండ జిల్లా నేరేడుచర్ల ఎస్‌ఐ డి.వెంకటేశ్వర్లు కథనం ప్రకారం...మండలంలోని దాసారం గ్రామానికి చెందిన తాళ్ళపల్లి సైదులు (25) అదే గ్రామంలో 2వ తరగతి చదువుతున్న ఏడేళ్ల బాలిక తల్లి మంచినీటి కోసం బోరువద్దకు వెళ్లగా ఆ బాలికను చింతగింజల ఆట ఆడుకుందామని ఇంట్లోకి రమ్మని పిలిచాడు. అయతే, ఆ బాలిక రానని మొరాయంచడంతో ఆ చిన్నారిని బలవంతంగా ఇంట్లోకి తీసుకెళ్ళి అత్యాచార యత్నానికి పాల్పడబోయాడు. ఆ సమయంలో బాలిక కేకలు వేయడం, అదే సమయంలో మంచినీటి కోసం వెళ్ళిన తల్లి రావడం గమనించిన నిందితుడు పరారయ్యాడు. ఇదిలావుండగా, ఇదే బాలికపై రెండేళ్ల కిందట కూడా ఇదే నిందితుడు అత్యాచార యత్నానికి పాల్పడగా గ్రామస్థులు మందలించారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు నిర్భయ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.