తెలంగాణ

అసద్ అసలు రంగు బయటపడింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 13: మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ అసలు రంగు బయటపడిందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కౌన్సిల్‌లో ప్రతిపక్ష నేత మహ్మద్ షబ్బీర్ అలీ ధ్వజమెత్తారు. మక్కా వెళ్ళేందుకు ముస్లింలకు సబ్సిడీ ఇవ్వాల్సిన అవసరం లేదని అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై షబ్బీర్ అలీ శుక్రవారం విలేఖరుల సమావేశంలో తీవ్ర అభ్యంతరం తెలిపారు. అసద్ ఆర్‌ఎస్‌ఎస్ అజెండాను మోస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆ విధంగా అసద్‌తో మాట్లాడించారా? అనే అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. 1932 సంవత్సరంలో బ్రిటీష్ హయాంలోనే మక్కా వెళ్ళే యాత్రికులకు సబ్సిడీ ప్రారంభమైందని ఆయన తెలిపారు. మక్కా వెళ్ళే ముస్లింలకే కాకుండా మానస సరోవర్ వెళ్ళే వారికీ సబ్సిడీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. 2004లో అసద్ ఆదాయం 74 లక్షలు కాగా 2014 నాటికి నాలుగు కోట్లకు ఎలా పెరిగిందని ఆయన ప్రశ్నించారు.