తెలంగాణ

యాదాద్రిలో తమిళనాడు మాజీగవర్నర్ రోశయ్య పూజలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదగిరిగుట్ట, జనవరి 22: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మినర్సింహస్వామి ఆలయాన్ని ఆదివారం తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య సందర్శించారు. దైవదర్శనం అనంతరం ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ ఆలయ పరిసరాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కొద్దిసేపు విలేఖరులతో మాట్లాడారు. యాదాద్రి శ్రీ లక్ష్మినర్సింహస్వామి దేవస్థానం అభివృద్ధి పనులు ఎలాంటి ఆటంకం లేకండా పూర్తికావాలని ఆయన ఆకాంక్షించారు. ఇప్పటికే యాదాద్రి ప్రపంచస్థాయిలో ఖ్యాతి గాంచిందని ఆయన అన్నారు. స్వామి దర్శనార్థం గతంలోను పలుమార్లు వచ్చానని ఆయన తెలిపారు. అంతకుముందు ఆయనకు అర్చకులు, అధికార్లు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు.

చిత్రం..యాదాద్రిలో తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య పూజలు