తెలంగాణ

పద్మ పురస్కార విజేతలకు సిఎం కెసిఆర్ అభినందనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 25: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డులకు ఎంపికైన వారికి తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అభినందనలు తెలిపారు. పద్మ విభూషణ్ అవార్డుకు ఎంపికైన ప్రముఖ గాయకుడు ఏసుదాసుకు ముఖ్యమంత్రి ప్రత్యేక అభినందనలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఎక్కా యాదగిరిరావు (శిల్పకళ), చింతకింది మల్లేశం (చేనేత), దరపల్లి రామయ్య (చెట్ల పెంపకం), బివిఆర్ మోహన్‌రెడ్డి (పారిశ్రామిక రంగం), ఎండి అబ్దుల్ వహీద్ (వైద్యరంగం), చంద్రకాంత్ పితావ్ (శాస్త్ర, సాంకేతిక రంగం)లకు పద్మశ్రీ పురస్కారాలు లభించడం పట్ల ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. వీరంతా తమ తమ రంగాలలో విశేష ప్రతిభ కనబర్చి యావత్ దేశానికి అదర్శంగా నిలిచారని ముఖ్యమంత్రి కొనియాడారు. ప్రజలకు ఉపయోగపడే రంగాల్లో కృషి చేసిన విశిష్ట వ్యక్తులను గుర్తించిన కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ముఖ్యమంత్రి అభినందించారు.