తెలంగాణ

చిన్నారిని చిదిమేసిన స్కూలు బస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పునుంతల, జనవరి 28: నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండల కేంద్రంలోని సదగోడు మార్గంలో ఒక ప్రైవేటు స్కూల్ బస్సు కింద పడి చిన్నారి దుర్మరణం చెందింది. అచ్చంపేట ఎస్సై అనుదీప్, ఉప్పునుంతల ఎస్సై మోహన్ కథనం ప్రకారం.. లింగోటంలోని ఆక్స్‌ఫర్డ్ పాఠశాలకు చెందిన బస్సు ఉప్పునుంతలకు వచ్చింది. చిన్నారి శృతిక (3) తన సోదరుడిని బస్సు ఎక్కించేందుకు తమ తాత నారాయణతో వచ్చింది. సోదరున్ని బస్సు ఎక్కించి తిరిగి బస్సుముందు భాగం నుంచి రోడ్డు దాటుతుండగా బస్సు ముందు భాగం ఎడమ టైరు కిందపడి శృతిక అక్కడిక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న అచ్చంపేట ఎస్సై అనుదీప్, ఉప్పునుంతల ఎస్సై మోహన్ ఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ దుర్ఘటన గురించి ఊరంతా వ్యాపించడంతో ప్రజలు భారీగా ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతురాలి కుటుంబానికి న్యాయం జరిగే వరకు కదిలేదిలేదని రోడ్డుపై బైఠాయించారు. ఎస్సైలు బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పడంతో ప్రజలు శాంతించారు. చిన్నారి శృతిక బస్సు కింద పడి మృతి చెందడంతో గ్రామంలో విషాధఛాయలు అలుముకున్నాయి. ఆయా పార్టీల నాయకులు మృతురాలి కుటుంబాన్ని ఓదార్చి ప్రభుత్వపరంగా ఆదుకోవాలని కోరారు.