తెలంగాణ

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్వాల్, జనవరి 28: భాగ్యనగరంలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని తాడ్‌బంద్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతిచెందగా, మరొకరు గాయపడ్డారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో బైక్‌పై బోయిన్‌పల్లి నుండి తాడ్‌బంద్ వైపు వెళ్తున్న ముగ్గురు యుకులు ప్రభుత్వ పాఠశాల వద్ద మూల మలుపులో అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని రోడ్డు ఎడమ వైపు పడ్డారు. ఆ సమయంలో తాడ్‌బంద్ నుండి బోయిన్‌పల్లి వైపు వస్తున్న లారీ వీరిమీద నుంచి పోవడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయ. విషయం తెల్సిన వెంటనే బోయిన్‌పల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను గాంధీ అసుపత్రికి తరలించారు. మృతులను మల్కాజిగిరి మున్సిపల్ పరిథిలోని బుద్ధనగర్‌కు చెందిన ఆనిరుధ్ (19), విశ్వ అలియాస్ చారి (20)గా గుర్తించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.