తెలంగాణ

‘ఓర్వలేకే ఆరోపణలు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జవవరి 30: తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేకే కాంగ్రెస్ నేతలు టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలచారి ఆరోపించారు. తెలంగాణ ప్రజలకు ముఖం చూపించలేకనే, పక్కరాష్ట్రం నుంచి చిదంబరాన్ని అరువు తెచ్చుకొన్న టీకాంగ్రెస్ నాయకులు టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేయించారని మండిపడ్డారు. ఢిల్లీలో సోమవారం నాడు విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల ముగిసిన శాసన సభ సమావేశాల్లో కాంగ్రెస్ చేసిన ఆరోపణలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మంత్రులు స్పష్టమైన సమాధానం ఇచ్చారని, కాంగ్రెస్ ఆరోపణలలో పస లేవని ఆయన కొట్టి పారేశారు.