తెలంగాణ

వ్యవస్థను ధ్వంసం చేసేందుకు మతతత్వ శక్తుల కుట్ర: చాడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 30: లౌకిక వ్యవస్థను ధ్వంసం చేసేందుకు మతోన్మాద శక్తులు కుట్రలు పన్నాయని సిపిఐ రాష్ట్ర సమితి కార్యదర్శి చాడ వెంకట రెడ్డి విమర్శించారు. సిపిఐ హైదరాబాద్ నగర సమితి కార్యదర్శి ఇటి.నరసింహ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన లౌకిక పరిరక్షణ దినోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగిస్తూ, మైనారిటీ, గిరిజన, దళిత, ఆదివాసీలపై హిందుత్వ ఫాసిస్టు శక్తులు దాడులకు తెగబడతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
సిఎంకు తమ్మినేని లేఖ
ఇదిలావుంటే, తునికాకు కట్టల ధరలను పెంచాలని, పెండింగ్‌లో ఉన్న బోనస్ బకాయిలను విడుదల చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు సోమవారం లేఖ రాశారు. తాను చేపట్టిన మహాజన పాదయాత్ర జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని ఎజెన్నీ ప్రాంతాల్లో సాగుతున్నదని తెలిపారు. ఈ పాదయాత్ర సందర్భంగా ఆదివాసీ, గిరిజనులు తన దృష్టికి తీసుకుని వచ్చిన అంశాలను లేఖ ద్వారా కెసిఆర్‌కు తెలియజేస్తున్నానన్నారు.