తెలంగాణ

ఇద్దరు రైతుల ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుర్రంపోడు, ఫిబ్రవరి 4: అప్పుల బాధతో ఇద్దరు రైతులు ఆత్మహత్యకు తెగబ డ్డారు. నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం తేనేపల్లి గ్రామానికి చెందిన దామోర మోజేష్ (30) శుక్రవారం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన మూడెకరాలతో పాటు మరో మూడెకరాలు కౌలుకు తీసుకుని ఆరు ఎకరాల్లో పత్తి సాగు చేయగా సరైన దిగుబడులు లేక 5లక్షల అప్పులు కావడంతో తీర్చే మార్గంలేక ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్నట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. భార్య స్వప్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లుగా హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ తెలిపారు. ఇదే మండలం పోచంపల్లి గ్రామానికి చెందిన పోలోజు బ్రహ్మచారి (50) అప్పుల బాధతో ఈ నెల 26న ఆత్మహత్యాయత్నం చేసుకోగా ఆయన నార్కట్‌పల్లి కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతొ శుక్రవారం మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ తెలిపారు.