తెలంగాణ
119 బీసీ గురుకులాల ఏర్పాటుకు సర్కారు ఓకే
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 5 February 2017
హైదరాబాద్, ఫిబ్రవరి 4: రాష్ట్రంలో 119 బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటుకు అనుమతిస్తూ, సంబంధిత ఉత్తర్వులపై సిఎం కెసిఆర్ శనివారం సంతకం చేశారు. 2017-18 సంవత్సరానికి 5, 6, 7 తరగతుల్లో ప్రవేశాలు జరుగుతాయి. ఒక్కో తరగతికి రెండు సెక్షన్ల చొప్పున 240మంది విద్యార్థులతో మొదటి ఏడాది స్కూళ్లు ప్రారంభమవుతాయి. స్కూళ్ల నిర్వాహణకు 3570మంది ఉద్యోగుల నియామకానికీ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన కెజి టూ పిజి ఉచిత విద్యాపథకం అమలుకు రెసిడెన్షిల్ స్కూల్స్ ద్వారా శ్రీకారం చుట్టనున్నట్టు సిఎం ప్రకటించారు. దీనిలో భాగంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతి నియోజక వర్గంలో ఒక రెసిడెన్షిల్ స్కూల్ ఉండేలా ఒకేసారి 119 రెసిడెన్షిల్ స్కూల్స్ను మంజూరు చేశారు.