తెలంగాణ

వైకాపా, తెరాస చీకటి మిత్రులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 9: వైఎస్‌ఆర్ కాంగ్రెస్, తెరాస పార్టీలు చీకటి మిత్రులుగా దివాళాకోరు రాజకీయాలు చేస్తున్నాయని తెలంగాణ తెలుగుదేశం పార్టీ (టిటిడిపి) అధ్యక్షుడు ఎల్.రమణ ఆరోపించారు. రానున్న 2019 ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు తెరమరుగవడం ఖాయమని అన్నారు. టిఆర్‌ఎస్‌తో పొత్తుకు టి-దేశం సందేశం అంటూ వచ్చిన వదంతులను రమణ ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. తెరాస సర్కార్ వైకాపాతో జత కట్టి, వైకాపా ఆంధ్రా ఎంపిలకు తెలంగాణ ప్రాజెక్టుల్లో కాంట్రాక్టులు కట్టబెట్టి తెలంగాణ ప్రజల సొమ్మును దోచిపెడుతున్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఒక వైపు తెలంగాణలో టిడిపిని బలహీనపర్చాలని తెరాస, వైకాపాలు ప్రయత్నించి, మరో వైపు ఎపిలో వైకాపా తన ఉనికిని కోల్పోతోందని అన్నారు. తెలంగాణకు పటేల్, పట్వారీ వ్యవస్థ రద్దుతో నిజమైన స్వాతంత్య్రం తెచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని అన్నారు.