తెలంగాణ

డిప్యూటీ సిఎంను అడ్డుకున్న గ్రామస్థులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఫిబ్రవరి 11: దేవాదుల ఎత్తిపోతల పథకంలో భాగంగా స్టేషన్ ఘనపూర్ మండలం మల్కాపూర్ వద్ద ప్రతిపాదించిన రిజర్వాయన్ నిర్మాణాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ లింగంపల్లి గ్రామప్రజలు ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరిని అడ్డుకుని నిరసన తెలిపారు. నగరంలో జరిగిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు శనివారం వరంగల్ వచ్చిన ఉపముఖ్యమంత్రి కడియం గెస్ట్‌హౌస్‌కు చేరుకోగా అప్పటికే అక్కడకు చేరుకున్న లింగంపల్లి గ్రామస్థులు ఉపముఖ్యమంత్రిని అడ్డుకుని మల్కాపూర్ రిజర్వాయర్ నిర్మాణంపై తన వ్యతిరేకత తెలిపారు.
రిజర్వాయర్ నిర్మిస్తే తమ గ్రామం పూర్తిగా మునిగిపోతుందని, దాంతో తామంతా రోడ్డునపడే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేసారు. దాంతో ఉపముఖ్యమంత్రి కడియం వారిని సముదాయించి కూర్చోబెట్టారు. ప్రాజెక్టుల నిర్మాణం సందర్భంగా కొన్ని గ్రామాలకు, కొందరు రైతులకు నష్టం కలుగుతుందని, కానీ వీటి నిర్మాణం వల్ల ఎంతోమందికి లాభం కలుగుతుందని ఆయన అన్నారు. మల్కాపూర్ రిజర్వాయర్ ఎత్తు తగ్గించడం ద్వారా లింగంపల్లి గ్రామం ముంపునకు గురికాకుండా విషయం ఇంజనీరింగ్ అధికారులతో చర్చించి న్యాయం జరిగేలా చూస్తానని ఆయన వారికి హామీ ఇచ్చారు.