తెలంగాణ

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయం: కాంగ్రెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 13: రానున్న ఉపాధ్యాయ ఎన్నికల్లో పోటీ చేయబోమని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం నాడిక్కడ గాంధీభవన్‌లో ముఖ్యనేతలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయ నియోజక వర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. కేంద్ర రాష్ట్రప్రభుత్వాల వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం గోబెల్స్‌ను మించి అబద్ధాలు ప్రచారం చేస్తోందని విమర్శించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రచారానికి ప్రాధాన్యత ఇస్తోందని ధ్వజమెత్తారు. 10 జిల్లాల్లో రోజుకో జిల్లా చొప్పున భారీ జన సమీకరణతో ‘జన ఆవేదన సమ్మేళనం’ నిర్వహించనున్నట్లు తెలిపారు. సోమవారం గాంధీభవన్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 19 నుంచి 28 వరకు ఈ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.