తెలంగాణ

మతిస్థిమితం లేని బాలికపై ఏడుగురి అత్యాచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 15: పాతబస్తీ సుల్తాన్ షాహీలో దారుణం చోటుచేసుకుంది. ఓ మతిస్థిమితం లేని బాలికపై ఏడుగురు అత్యాచారానికి పాల్పడిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. కిడ్నాపర్ల నుంచి తప్పించుకుని వచ్చిన బాలిక జరిగిన విషయం తండ్రికి చెప్పడంతో బాలిక తండ్రి మొగల్‌పుర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని విచారించి వదిలేశారు. ఈ విషయం పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో వదిలేసిన నిందితులను మళ్లీ అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన అజయ్, కరణ్‌లను అరెస్టు చేసి వారిపై కిడ్నాప్, నిర్భయ కేసులు నమోదు చేశారు. పరారీలో ఉన్న మరో ఐదుగురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితులను త్వరలో పట్టుకుంటామని మొగల్‌పుర పోలీసులు తెలిపారు.