తెలంగాణ

బంగారు గడ్డ కాదు..బొందల గడ్డగా మార్చారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, ఫిబ్రవరి 15 : రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తానని చెప్పిన సిఎం కెసిఆర్...బొందల గడ్డగా మార్చారని తెలంగాణ తెలుగుదేశం వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్నదాతల ఆత్మహత్యల్లో రాష్ట్రం రెండోస్థానంలో నిలిచిందన్నారు. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను మూడేళ్ల కెసిఆర్ పాలనలో 1.07 లక్షల అప్పుల రాష్ట్రంగా మార్చారని దుయ్యపట్టారు. బుధవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై జరిగిన ప్రజాపోరు బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని టిఆర్‌ఎస్ నెరవేర్చలేదని, హామీలు అమలు కోసం ప్రభుత్వం మెడలు వంచేందుకు తెలుగుదేశం పార్టీ ప్రజా పోరు యాత్ర చేపట్టినట్లు పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో అరచేతిలో వైకుంఠం చూపిన కెసిఆర్ అధికారంలోకి రాగానే హామీలను విస్మరించి ప్రజలను నట్టేట ముంచారన్నారు. డబ్బా ఇళ్లు కాదని, డబుల్ బెడ్‌రూంల ఇళ్లు కడతామని చెప్పి 950 ఇళ్లు మాత్రమే కట్టారన్నారు. కెసిఆర్‌ను కనిపెంచిన చింతమడ్కలో సైతం ఒక్క డబుల్ బెడ్‌రూం ఇల్లు నిర్మించలేదన్నారు. సిఎం కెసిఆర్ ఇచ్చిన హామీల అమలు, బంగారు తెలంగాణ సాధనపై సిఎం సొంత గ్రామమైన చింతమడ్కలోనైనా, తెలంగాణ సిద్దాంతకర్త జయశంకర్ స్వగ్రామంలోనైనా బహిరంగ చర్చకు సిద్ధమేనన్నారు. జయశంకర్ నివాసం ఉన్న ఇంటిని లైబ్రరీగా మార్చుతానని ఇచ్చిన హామీని విస్మరించారన్నారు. సిఎం కెసిఆర్ రాష్ట్ర ముఖ్యమత్రిగా కాకుండా ఎర్రవెల్లి గ్రామానికి సర్పంచ్‌గా వ్యవహరిస్తున్నాడని విమర్శించారు.
దళితులకు 3ఎకరాల భూ పంపిణీపై నిధులున్నా భూమి దొరకడం లేదని సిఎం కెసిఆర్ అసెంబ్లీ సాక్షిగా వెల్లడించాడన్నారు. రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తానని చెప్పిన కెసిఆర్ మూడు బడ్జెట్‌లు ప్రవేశపెట్టినా ఇంతవరకు పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం పంట నష్ట పరిహారం, 793 కోట్ల ఇన్‌పుడ్ సబ్సిడీ కేటాయిస్తే రైతులకు చెల్లించకుండా వాటర్ గ్రిడ్ బిల్లుల చెల్లింపుకు మళ్లించడం దారుణమన్నారు. ప్రజా సమస్యలు పట్టించుకోని నాయకులు ఓట్ల కోసం వస్తే నిలదీయాలని పిలుపునిచ్చారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు ప్రజలతో మమేకమై టిడిపి పోరాటాలు చేస్తుందన్నారు. బంగారు తెలంగాణ ఏమోగాని కెసిఆర్ కుటుంబానికి మాత్రం బంగారంగా మారిందన్నారు. అధికారం, ఉద్యోగాలు అన్ని వారికే వచ్చాయి కాని పేదలకు మాత్రం ఏమీ రాలేదన్నారు. మల్లన్నసాగర్ ప్రజల పక్షాన రెండు రోజులు దీక్షలు చేపట్టానని, కుల వృత్తుల వారికి సైతం ప్రభుత్వం పరిహారం చెల్లించేందుకు ముందుకు వచ్చిందన్నారు.కొండపోచమ్మ ప్రాజెక్టు నిర్వాసిత రైతులకు అండగా ఉంటానన్నారు.
అంతకుముందు టిడిపి నిర్వహించిన భారీ ర్యాలీలో వేలాది మంది యువకులు కదం తొక్కారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ, తెలుగురైతు అధ్యక్షుడు ప్రతాప్‌రెడ్డి, పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.

చిత్రం..సమావేశంలో మాట్లాడుతున్న టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి