తెలంగాణ

మంత్రి పద్మారావు కొడుకు అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 16: సికిందరాబాద్ మోండా మార్కెట్‌లోని ఓ ఫుట్‌పాత్ వ్యాపారిపై దాడి కేసులో ఎక్సైజ్ శాఖ మంత్రి టి పద్మారావు తనయుడు రాజేశ్వర్‌గౌడ్ సహా ఏడుగురిని గురువారం పోలీసులు అరెస్టు చేశారు. ఈనెల 14న సికిందరాబాద్‌లోని ఫుట్‌పాత్‌పై పచ్చళ్ల వ్యాపారి రాజేష్‌పై మంత్రి కొడుకు రాజేశ్వర్‌గౌడ్, అతని అనుచరులు కలసి దాడికి పాల్పడ్డారు. ఈ మేరకు రాజేష్ మోండా పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు గురువారం మంత్రి కొడుకుతోపాటు మరో ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. కాగా వీరిని స్టేషన్ బెయిల్‌పై విడుదల చేసినట్టు తెలిసింది. ఇదిలావుండగా మంత్రి పద్మారావు కేసును రాజీ కుదుర్చుకునేందుకు యత్నిస్తున్నట్టు తెలుస్తోంది.