తెలంగాణ

కాల్ సెంటర్ ఉద్యోగిని హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/గచ్చిబౌలి, ఫిబ్రవరి 16: సైబరాబాద్‌లో ఓ కాల్‌సెంటర్ ఉద్యోగి దారుణ హత్యకు గురైంది. సికింద్రాబాద్ బన్సీలాల్‌పేటకు చెందిన కె సునీత (34)ను బుధవారం రాత్రి కొందరు దుండగులు హతమార్చి, మృతదేహాన్ని మాదాపూర్ భాగ్యనగర్ సొసైటీకి తీసుకువచ్చి అక్కడ నిర్మానుష్య ప్రదేశంలో తగులబెట్టి పరారయ్యారు. ఆమె రిటైర్డ్ రైల్వే ఉద్యోగి మాణిక్‌రావు కుమార్తె. గతంలో ‘షాదీడాట్‌కామ్’లో పనిచేసిన సునీత నెల రోజుల క్రితం అమీర్‌పేటలోని ‘మాన్‌స్టర్ డాట్‌కామ్’ సంస్థలో సేల్స్ రిప్రజంటేటివ్‌గా చేరినట్లు పోలీసులు విచారణలో తేలింది. మృతదేహం పక్కనే పడి ఉన్న పర్స్‌లోని సిమ్ కార్డు ఆధారంగా ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సిమ్‌లోని నెంబర్ల ఆధారంగా పోలీసులు వివరాలను సేకరిస్తున్నారు. ఈనెల 14న ఇం ట్లోంచి డ్యూటీకని వెళ్లిందని, కానీ వరుసగా రెండు రోజులు ఆమె డ్యూటీకి హాజరు కాలేదని పోలీసులు తెలిపారు. ఎక్కడో చంపి, ఆమెను మోటార్ సైకిల్‌పై తీసుకువచ్చి, మృతదేహాన్ని తగులబెట్టి ఉంటే ఆ దృశ్యాలు సిసి టీవీల్లో రికార్డయి ఉంటాయన్న అనుమానంతో సిసి కెమెరాల్లో దృశ్యాలను పరిశీలిస్తున్నారు. సునీతను ఓ యువకుడు ప్రేమించి మోసం చేయగా ఆమె గోపాలపురం పోలీసుస్టేషన్‌లో కేసు పెట్టినట్లు తెలిసింది. పాత ప్రియుడే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడా? లేక మరెవరైనా ఉన్నారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

మృతురాలు సునీత (ఫైల్‌ఫొటో)