తెలంగాణ

మహాజన పాదయాత్రకు ప్రకాశ్ కారత్ రాక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 17: సిపిఎం చేపట్టిన మహాజన పాదయాత్ర ఈ నెల 18కి 125 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ పార్టీ అగ్రనేత ప్రకాశ్ కారత్ ఖమ్మం పట్టణంలో జరిగే మహాజన పాదయాత్రలో పాల్గొంటారని మహాజన పాదయాత్ర రాష్ట్ర కో ఆర్డినేటర్ బి.వెంకట్ తెలిపారు. గత ఏడాది అక్టోబర్ 17న రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ప్రారంభించిన మహాజన పాదయాత్ర ఇప్పటి వరకు 24 జిల్లాల్లో 3350 కిలోమీటర్లు కొనసాగిందని తెలిపారు. ఇబ్రహీంపట్నంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనవడు, సామాజిక ఉద్యమ నేత ప్రకాష్ అంబేద్కర్ ప్రారంభించిన మహాజన పాదయాత్ర విజయవంతంగా జరుగుతోందని అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆరే స్వయంగా పాదయాత్రను అడ్డుకోండని పిలుపునిచ్చినా ప్రజలు తిరస్కరించారని, సామాజిక తరగతులు, అభ్యుదయ వాదులు యాత్రకు ఘనమైన స్వాగతం పలుకుతున్నారని వెంకట్ ఒక ప్రకటనలో తెలిపారు. ఖమ్మం విచ్చేస్తున్న ప్రకాశ్ కారత్ ఖమ్మం రూరల్ మండలంలోని వరంగల్ క్రాస్‌రోడ్స్‌లో నిర్మించిన భవనాన్ని సాయంత్రం 4 గంటలకు ప్రారంభిస్తారని తెలిపారు.