తెలంగాణ

ఉత్తమ్ సర్వేలు బోగస్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, ఫిబ్రవరి 17: సిఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మరోసారి తన విలక్షణ రాజకీయ శైలిని చాటుతూ పిసిసి చీఫ్ ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై ధ్వజమెత్తారు. ఇటీవల పిసిసి చీఫ్ ఉత్తమ్‌తో రెండు పర్యాయాలు పార్టీ కార్యక్రమాల వేదికను పంచుకుని, తన ఇంటికి సైతం ఆహ్వానించిన కోమటిరెడ్డి ఇంతలోనే మనసుమార్చుకుని మళ్లీ ఉత్తమ్‌పై ఫైర్ అయ్యారు. శుక్రవారం నల్లగొండ కోర్టుకు హాజరైన సందర్భంలో విలేఖరులతో ఆయన మాట్లాడారు. పిసిసి చీఫ్ జరిపించిన సర్వేలు బోగస్ అంటూ కొట్టిపారేశారు. తాజాగా ఉత్తమ్ జరిపించిన సర్వేల్లో జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాలకుగాను భువనగిరి, నకిరేకల్ మినహా మిగతా పది స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుందంటూ పత్రికల్లో కథనాలు రావడాన్ని ఆయన ఖండించారు. నకిరేకల్, భువనగిరిలలో కాంగ్రెస్ తప్పక విజయం సాధిస్తుందని కోమటిరెడ్డి జోస్యం చెప్పారు. పనిలో పనిగా తన అనుచరుడు, మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పర్యవేక్షణలో ఉన్న నకిరేకల్‌లో, సోదరుడు ఎమ్మెల్సీ రాజగోపాల్‌రెడ్డి పర్యవేక్షణలోని భువనగిరిలో కాంగ్రెస్ ఓడిపోతుందంటూ సర్వేలతో లీక్‌లిచ్చిన ఉత్తమ్‌పై కోమటిరెడ్డి ఫైర్ అయ్యారు. గడ్డాలు, మీసాలు పెంచినంత మాత్రన కాంగ్రెస్ అధికారంలోకి రాదన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి ప్రజలను కదిలించి 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవడమే తన ప్రధాన లక్ష్యమని అన్నారు.