తెలంగాణ

సైబర్ నేరగాళ్ల అడ్డాగా గాంధీభవన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 20: గాంధీభవన్‌ను సైబర్ నేరగాళ్లకు అడ్డాగా మార్చారని టిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఆరోపించారు. సామాజిక మాధ్యమాల ద్వారా కెసిఆర్‌కు, టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. పోలీసులు గాంధీభవన్‌పై ఓ కనె్నసి సైబర్ నేరగాళ్ల ఆట కట్టించాలని కోరారు. కెసిఆర్ ప్రసంగాలను తమ కిష్టమైన విధంగా ఎడిట్ చేసి కట్ అండ్ ఫేస్ట్‌తో సొంత కవిత్వాలను జోడించి సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేస్తున్న సైబర్ నేరగాళ్లు చర్లగూడెం నిర్వాసితులకు అన్న పదాన్ని తొలగించి ఇంటికొక ఉద్యోగం ఇస్తాం అని ముఖ్యమంత్రి మాటలు మాత్రమే ఉన్న నకిలీ వీడియోను సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారని కర్నె ప్రభాకర్ ఆరోపించారు.