తెలంగాణ
దేశంలోనే మొదటి డిజిటల్ కాచిగూడ రైల్వే స్టేషన్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
హైదరాబాద్, ఫిబ్రవరి 20: కాచిగూడ రైల్వే స్టేషన్లో డిజిటల్ పేమెంట్లు జరిగేలా చర్యలు తీసుకున్నారు. సోమవారం దక్షిణ మధ్య రైల్వే జిఎం వినోద్కమార్ యాదవ్ డిజిపేను ప్రారంభించారు. దీంతో దేశంలోనే తొలి డిజిటల్ రైల్వే స్టేషన్గా కాచిగూడ చరిత్రకెక్కింది. ఈ స్టేషన్లో అన్ని సేవలను పాయింట్ ఆఫ్ సేల్ యంత్రాల ద్వారా అందించనున్నారు. టీ నుంచి మొదలుకొని టికెట్ వెండర్ వరకు 20 స్టాళ్లలో క్యాష్లెస్ సేవలు అమల్లోకి వచ్చాయి. ఈ సందర్భంగా రైల్వే జిఎం వినోద్కుమార్ యాదవ్ మాట్లాడుతూ, కాచిగూడ రైల్వే స్టేషన్లో దాదాపు 30 మంది కాంట్రాక్టర్ల సహకారం మేరకు వంద శాతం డిజిటలైజేషన్ సాధ్యమైందని జిఎం తెలిపారు. రైల్వే స్టేషన్లోని ప్రయాణికుల సౌలభ్యం కోసం టీ, టిఫిన్ సెంటర్, బుక్ స్టాల్, కూల్డ్రింక్స్, ఎంఎంటిఎస్, ప్రత్యేక రైళ్ల రిజర్వేషన్లు, పార్కింగ్ వద్ద కూడా పేటిఎం వంటి సౌకర్యం ఉందన్నారు. ఎటిఎం, డెబిట్ కార్డుల ద్వారా రిజర్వేషన్లు, కొనుగోలు చేసుకోవచ్చన్నారు. దక్షిణ మధ్య రైల్వే త్వరలో మరో నాలుగు స్టేషన్లను డిజటలైజేషన్ చేయనుందని వినోద్కుమార్ యాదవ్ తెలిపారు. దక్షిణాది రాష్ట్రాల్లోని రైల్వే స్టేషన్లలో నగదు రహిత సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు కృషి సల్పుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రైల్వే అదనపు జనరల్ మేనేజర్ ఏకె గుప్తా, చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ జ్ఞానేశ్వర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.