తెలంగాణ
రాష్ట్రంలో నియంతృత్వ పాలన
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
హైదరాబాద్, ఫిబ్రవరి 22: నిరుద్యోగుల నిరసన ర్యాలీని భగ్నం చేసేందుకు తెలంగాణ జెఎసి నేత ప్రొఫెసర్ కోదండరామ్ను అర్ధ రాత్రి అరెస్టు చేయడం అత్యంత హేయమైన చర్యగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి అభివర్ణించారు. కెసిఆర్ నేతృత్వంలోని తెరాస ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరించిందని మండపడ్డారు. ఈ చర్య తెలంగాణలో నియంతృత్వ పాలనకు నిదర్శనంగా నిలుస్తుందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిధులు, నీళ్లు, ఉద్యోగాలనే అంశాల ఆధారంగానే తెలంగాణ ఉద్యమం జరిగిందని గుర్తు చేశారు. 33 నెలలు గడచినా ఉద్యోగ నియామకాల ప్రక్రియ నిర్లక్ష్యంగా సాగుతోందని అన్నారు. ఉద్యోగాలు భర్తీ చేయాలనే డిమాండ్తో విద్యార్థులు, యువత ఉద్యమిస్తే అడ్డుకోవడం, అరెస్టులు చేయడం, అణచివేత ధోరణిని అవలంభిస్తున్న తెరాస ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. కాగా కోదండరామ్ అరెస్టును మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. నాజీల పాలనను తలపిస్తోందని అన్నారు. కోదండరామ్ను అర్ధరాత్రి తలుపులు పగులగొట్టి అరెస్టు చేయడం అప్రజాస్వామికమని టిపిసిసి ఉపాధ్యక్షుడు మల్లు రవి ఖండించారు.
ఇది కక్షపూరిత వైఖరికి నిదర్శనం: సిపిఐ
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తికే స్వరాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి రావడం దారుణమని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విచారం వ్యక్తం చేశారు. కోదండరామ్ అరెస్టు ప్రభుత్వ కక్షపూరిత వైఖరికి నిదర్శనమని అన్నారు. సిఎం కెసిఆర్ అప్రజాస్వామిక పోకడలకు ఇది పరాకాష్టగా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇందుకు ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
అరెస్టు దౌర్జన్యమే: డాక్టర్ లక్ష్మణ్
ప్రొఫెసర్ కోదండరాంను అరెస్టు చేయడం దౌర్జన్యమేనని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల ప్రవర్తన చూస్తుంటే నాడు తెలంగాణ ఉద్యమకారులపై ఆనాటి సమైఖ్య రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరును గుర్తుచేస్తోందని పేర్కొన్నారు. నాటి ప్రభుత్వానికి నేటి ప్రభుత్వానికి తేడా లేదని అన్నారు. నిరసన కార్యక్రమాల్లో పాల్గొనడం సహజమేనని కాని పోలీసుల దౌర్జన్యం అణచివేసే ప్రయత్నం సరికాదని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అనుభవం ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాస్వామికంగా వ్యవహరించాలని అన్నారు.