తెలంగాణ

కెసిఆర్ వైఫల్యాలపై పాదయాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిప్పర్తి, ఫిబ్రవరి 23: తెలంగాణలో ప్రజలకిచ్చిన హామీలను తుంగలో తొక్కి నియంతృత్వ పాలన సాగిస్తున్న సిఎం కెసిఆర్ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పాలని సిఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిలు పిలుపునిచ్చారు. మండలంలో దుప్పలపల్లి నుండి తిప్పర్తి వరకు 1000 మోటార్ సైకిళ్ల ర్యాలీ, కోలాట ప్రదర్శనలతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో కోమటిరెడ్డి బ్రదర్స్ స్వయంగా 8 కిలో మీటర్లు బైకు నడిపారు. మామిడాల శంభులింగేశ్వర ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం తిప్పర్తి సెంటర్‌లో మూడు లక్షలతో నిర్మించనున్న ఐమాస్ట్ లైట్లకు శంకుస్థాపన చేశారు. సిసి రోడ్లను ప్రారంభిచారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కెసిఆర్ అమలు చేయకుండా ప్రజలను మోసగించారన్నారు. కెసిఆర్ పాలన వైఫల్యాలను ప్రజల్లో ఎండగడుతూ తాము త్వరలోనే పాదయాత్ర చేపడుతామని వారు ప్రకటించారు. తమ పాదయాత్రతో కాంగ్రెస్ బలోపేతమై టిఆర్‌ఎస్ ఖాళీ కావడం ఖాయమన్నారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌ను 100 సీట్లలో గెలిపించి తెలంగాణలో అధికారంలోకి తెస్తామన్నారు. తెలంగాణ ఉద్యమానికి కేంద్ర బిందువుగా పనిచేసిన జెఎసి చైర్మన్ కోదండరాంను అక్రమంగా టిఆర్‌ఎస్ ప్రభుత్వం అరెస్టు చేయించడం బాధకరమన్నారు. రైతులు మద్దతు ధర కోసం స్వామినాధన్ కమిషన్‌ను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. డబుల్ బెడ్‌రూమ్స్, మూడెకరాల భూమి, ఎస్టీ, మైనార్టీ రిజర్వేషన్లు, తండాల ఏర్పాటు, కెజి టూ పిజి విద్య వంటి ఏ హామీలను కూడా టిఆర్‌ఎస్ అమలు చేయలేదని విమర్శించారు. లక్ష ఉద్యోగాలిస్తామని ఇవ్వకపోవడంతో విద్యార్థులు, నిరుద్యోగులు మళ్లీ ఉద్యమబాట పట్టడానికి కెసిఆర్ కారణమయ్యారన్నారు. రుణమాఫీ, ఇన్‌ఫుట్ సబ్సిడీ రైతులకు సక్రమంగా అందించలేదని, విద్యార్థుల ఫీజు రీయంబర్స్‌మెంట్, ఆరోగ్య శ్రీ పథకాలు నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. కార్యక్రమంలో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, డిసిసి ఉపాధ్యక్షుడు చింతకుంట్ల రవీందర్‌రెడ్డి, డిసిసిబి డైరక్టర్ పాశం సంపత్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు జూకురు రమేశ్, ఎంపిటిసిలు కినె్నర అంజయ్య, లోడంగి వెంకన్న, ప్రశాంత్, సుధీర్ పాల్గొన్నారు.