తెలంగాణ

బడ్జెట్‌కు మంత్రిమండలి ఆమోదం 12న

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 10: శాసనసభలో 13వ తేదీన ప్రవేశ పెట్టనున్న బడ్జెట్ ప్రతిపాదనను ఆమోదించడానికి 12వ తేదీన మంత్రిమండలి సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరుగనున్న మంత్రి మండలి సమావేశాన్ని మొట్ట మొదటిసారిగా సచివాలయంలో కాకుండా ప్రగతి భవన్‌లో ఈసారి ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వం వెల్లడించింది. వివిధ శాఖల సమీక్షలకు మాత్రమే ఇంతవరకు పరిమితమైన ప్రగతి భవన్‌లో ఇక నుంచి మంత్రిమండలి సమావేశాలు కూడా జరుగడం విశేషం. ఇలా ఉండగా క్యాంపు కార్యాలయ ఆవరణలో ప్రగతి భవన్ నిర్మించినప్పటి నుంచి ముఖ్యమంత్రి సచివాలయానికి రావడం పూర్తిగా మానేశారు. మంత్రిమండలి సమావేశాలు జరిగినప్పుడు మాత్రమే సచివాలయానికి వస్తున్న ముఖ్యమంత్రి, ఇక వీటిని కూడా ప్రగతి భవన్‌లో జరపాలని తాజాగా నిర్ణయించడంతో సచివాలయానికి ముఖ్యమంత్రి ఇక వచ్చే అవకాశం లేనట్టే.