తెలంగాణ

బ్రహ్మపుష్కరిణిలో కోనేటి రాయుని జలవిహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మపురి, మార్చి 14: ధర్మపురి క్షేత్రంలో నిర్వహిస్తున్న స్వామివారల బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా, మంగళవారం కలియుగ దైవమైన శ్రీవేంకటేశ్వరుని తెప్పోత్సవ, డోలోత్సవ కార్యక్రమాలు కన్నుల పండువ గా జరిగాయి. లోకకల్యాణార్థం, ప్రతియేటా సనాతన సాంప్రదాయ పద్ధతి లో, తరతరాల వారసత్వ ఆచార అనుసరణలో భాగంగా కల్యాణాది ప్రత్యే క ఉత్సవాలు నిర్వహించారు. అనంతరం శ్రీవేంకట నాథుడు తన దేవేరితోకూడి బ్రహ్మపుష్కరిణికి వ్యా హ్యాళి (విహారానికి) వెళ్ళడం అనాదిగా వస్తున్న సాంప్రదాయం. ఈనేపథ్యం లో సాయంత్రం నాలుగు గంటలకు ముందుగా ప్రధానాలయం నుండి శ్రీవేంకటేశ్వరుని ఉత్సవ మూర్తులను, ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయంచి, మంగళవాయద్యాలు, వేదమంత్రాలయుక్తంగా కోనేరుకు ఊరేగింపుగా వెళ్ళి ఉత్తర ద్వారంగుండా ప్రవేశించగా భక్తులు ఆనందోత్సాహాలతో జయజయ ధ్వనాలతో స్వాగతించారు. ప్రత్యేక నూతన నిర్మి త హంస వాహనంపై స్వామిని ఆసీనులను చేసి, కోనేరు నీటిపై ఐదు ప్రదక్షిణలు చేయగా, ముకుళిత హస్తాలతో భక్తులు స్వామిని అనుసరించారు. పుష్కరిణి మధ్యభాగానగల భోగమంటపంలోని ఊయలలో స్వామిని ఆసీనులను చేసి నిర్వహించిన డోలోత్సవాన్ని కన్నులారాగాంచి భక్తులు తరించారు. ఆధ్యాత్మిక ప్రసంగాలు, వేదఘోషలు, ఆశీర్వచనాలను దేవస్థానం ఆస్థాన వేదపండితులు బొజ్జా రమేశశర్మ, అర్చకులు నేరేళ్ళ శ్రీనివాసాచార్య, శ్రీ్ధరాచార్య తదితరులు నిర్వహించారు. ఇఓ సుప్రియ, కమిటీ బాధ్యులు శ్రీకాంత్ రెడ్డి, సభ్యులు, తదితరులు కార్యక్రమాలకు హాజరయ్యారు.