తెలంగాణ

పిఇసెట్ షెడ్యూలు జారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 21: తెలంగాణ రాష్ట్రంలోని బిపిఇడి, డిపిఇడి కోర్సుల్లో ప్రవేశానికి టిఎస్ పిఇసెట్‌ను మే 15వ తేదీ నుండి నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూలును ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి మంగళవారం విడుదల చేశారు. బిపిఇడి , డిపిఇడి రెండేళ్ల కోర్సు ఉంటుందని, ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను 23న జారీ చేస్తామని చెప్పారు. ఆన్‌లైన్ దరఖాస్తులు 24నుండి స్వీకరిస్తామని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్ 28 వరకూ గడువు ఉంటుందని, 500 అపరాధ రుసుంతో మే 3 వరకూ, 2వేల జరిమానాతో8 వరకూ, 5వేల జరిమానాతో 11 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చని, హాల్‌టిక్కెట్లు మే 6వ తేదీ నుండి జారీ చేస్తామని పేర్కొన్నారు. ఫలితాలు మే 21న ఇచ్చే వీలుందని చెప్పారు.