తెలంగాణ

బాలికపై గ్యాంగ్ రేప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ చాంద్రాయణగుట్ట, మార్చి 24: కామంతో కళ్లుమూసుకుపోయిన దుర్మార్గులు బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వారం రోజులు పాటు జరిగిన ఈ దుర్మార్గం ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ సంఘటన బంజారాహిల్స్ పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిందితులు కోసం గాలిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని సయ్యద్‌నగర్‌లో నివసించే పదేళ్ల బాలిక ఎన్‌బిటి నగర్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో మూడో తరగతి చదువుతోంది. బాలిక సోదరి ఎన్‌బిటి నగర్‌లోనే పదోతరగతి పరీక్షలు రాస్తుండగా ప్రతిరోజు అక్కడికి తోడుగా స్కూల్‌కు వస్తూ అక్కడే కూర్చుంటోంది. దీన్ని అదునుగా ఇద్దరు యువకులు ఈ బాలికపై కనే్నశారు. వారం క్రితం మాయ మాటలు చెప్పి వ్యాన్‌లో ఎక్కించుకొని సయ్యద్‌నగర్‌లోని ఓ షెట్టర్‌లోకి తీసుకెళ్లి మత్తు ఇచ్చి అత్యాచారం చేశారు. ఆ మరుసటి రోజు కూడా అదే రీతిలో వ్యాన్‌లో ఎక్కించుకొని ఎన్‌బిటినగర్‌లోనే ఓ గదిలోకి తీసుకెళ్లారు. ఇలా ప్రతిరోజు బాలికను భయపెట్టి తీసుకెళ్లి ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ బెదిరించడంతో బాలిక భయపడి ఈ విషయం దాచింది. ఇది ఇలా వుండగా బాలిక తీవ్ర నొప్పితో విలవిల్లాడుతుండటంతో తల్లి గమనించింది. ఈ విషయమై లోతుగా ఆరా తీయగా బాలిక విషయమంతా చెప్పింది. దీంతో బాలిక తల్లిదండ్రులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రతి రోజు తనలాగే మరోబాలికను కూడా తీసుకొచ్చేవారని బాధితురాలు వెల్లడించింది. ఇద్దరు యువకులు వయసు 22 ఏళ్లు ఉంటుందని ఆమె చెప్పింది. వారిని తాను గుర్తుపడతానని ఆమె అన్నారు. రేపిస్టులపై ఐపిసి 354(ఎ), 376 రెడ్‌విత్ 511 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసును ఇన్‌స్పెక్టర్ కె.శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎస్‌ఐ బి.దయాకర్ దర్యాప్తు జరుపుతున్నారు.