తెలంగాణ

అజ్మీర్ దర్గాకు టిడిపి చాదర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 27: రానున్న 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే విధంగా అల్లా ఆశీస్సులు ఉండాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ ఆధ్వర్వంలో అజ్మీర్ దర్గాకు చాదర్ (పవిత్ర వస్త్రం) పంపించారు. సోమవారం నాడిక్కడ ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో ఎల్.రమణ ఎన్‌టిఆర్ విగ్రహం వద్ద నమస్కరించి అనంతరం పవిత్ర వస్త్రాన్ని పళ్లెంలో ఉంచి పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు తాజుద్దీన్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు అందజేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతలు, తెలంగాణ ప్రజల శ్రేయస్సును కోరుతూ మైనార్టీ సోదరులు పవిత్ర వస్త్రం చుట్టు నిలబడి ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు రమణ మాట్లాడుతూ 2019లో అధికారంలోకి వచ్చి ప్రజల సమస్యల పరిష్కారం కోసం తమ పార్టీని ఆశీర్వదించాలని పవిత్ర వస్త్రాన్ని పంపిస్తున్నట్లు తెలిపారు. ముస్లిం సోదరులను హజ్ యాత్రకు పంపడానికి హజ్‌హౌస్ ఏర్పాటు చేసిన ఘనత చంద్రబాబునాయుడుదేనని అన్నారు.

చిత్రం..సోమవారం ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌నుంచి చాదర్‌ను మోసుకెళ్తున్న ఎల్.రమణ