తెలంగాణ

గవర్నర్‌తో కెసిఆర్ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 25: గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు శుక్రవారం మధ్యాహ్నం భేటీ అయ్యారు. రాజ్‌భవన్‌లో ముఖ్యమంత్రి సుమారు రెండు గంటలపాటు గవర్నర్‌తో సమావేశమయ్యారు. శాసనసభ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్న తీరు తెన్నులు, ఈ నెల 29న సభలో ప్రవేశపెట్టనున్న ద్రవ్యవినిమయ బిల్లు తదితర అంశాలపై చర్చించినట్టు తెలిసింది. అలాగే బడ్జెట్ సమావేశాలు ముగిసిన అనంతరం ఈ నెల 30, 31 తేదీలలో రెండు రోజుల పాటు ఉభయ సభల సభ్యులకు నీటిపారుదల ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయనున్న అంశాన్ని కూడా గవర్నర్‌కు ముఖ్యమంత్రి వివరించినట్టు తెలిసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో జరిపిన వీడియో కాన్ఫరెన్స్‌లో తెలంగాణ ప్రభుత్వానికి కితాబు ఇచ్చిన అంశాన్ని కూడా గవర్నర్‌కు ముఖ్యమంత్రి వివరించినట్టు సమాచారం.