తెలంగాణ

కల్యాణ వైభోగమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, ఏప్రిల్ 5: కలియుగ వైకుంఠంగా భాసిల్లుతున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం క్షేత్రంలో చలువ పందిళ్లు, వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య సీతారాముల కల్యాణ మహోత్సవం బుధవారం అంగరంగ వైభవంగా సాగింది. కన్నులపండువగా జరిగిన కల్యాణాన్ని భక్తులు తిలకించి పులకించారు. వేదమంత్రాల మధ్య కల్యాణ రాముడు సీతమ్మ మెడలో జనక, దశరథ, రామదాసులు తయారు చేయించిన మూడు మంగళసూత్రాలతో మాంగల్యధారణ చేశారు. ఈ అపురూప ఘట్టం తిలకిస్తున్న వేలాది భక్తజనం జై శ్రీరాం అంటూ నినదించడంతో మిథిలానగరి పులకించింది. వైకుంఠరాముడు పెళ్లికుమారుని శోభతో దివ్యమంగళ రూపంతో వెలిగిపోగా, జనకమహారాజు గారాలపట్టి, అపురూప లావణ్యవతి జానకీదేవిని నయన మనోహరంగా అలంకరించారు. అభిజిత్ లగ్నంలో సీతారాముల కల్యాణం ఘనంగా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా రాష్ట్ర దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సంప్రదాయంగా అందించారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరుపున ఈఓ సాంబశివరావు, డాలర్ శేషాద్రి సుదర్శన పర్కం సమర్పించారు. ముందుగా మూలవరులకు ప్రత్యేక ఆరాధన చేసి స్వామికి అభిషేకం చేశారు. తర్వాత నీలమేఘశ్యాముడు ధీరోధాత్తుడిగా ఆశీనుడై, సీతామహాలక్ష్మి వినయ సంపన్నురాలిగా కూర్చుని ఊరేగింపుతో మిథిలానగరానికి వచ్చి రజత సింహాసనంపై ఆశీనులయ్యారు. విష్వక్సేనుడికి పూజలు నిర్వహించే ప్రక్రియతో పెళ్లి సంబరం మొదలైంది. శ్రీరాముడు సీతమ్మల ఆశీస్సులను భక్తులకు అందించడానికి పరిచయ కార్యక్రమాన్ని చేపట్టారు. సీతమ్మకు 12దర్బలు, 24 అంగుళాలతో చేసిన యోక్ర దర్బను దోషనివారణకు నడుముకు ధరింప చేశారు. స్వామివారికి బంగారు యజ్ఞోపవీతధారణ చేశారు. కన్యాదాన ప్రక్రియలో కీలకమైన కాళ్లు కడిగి కన్యాదానం చేసే వరపూజ పూర్తి చేశారు. సీతామహాలక్ష్మికి చింతాకు పతకం, రాములవారికి పచ్చలహారం, లక్ష్మణుడికి రామమాడ వేశారు. మధుపర్క వస్త్రాల నివేదనతో వధూవరులు అలంకార శోభితులయ్యారు. సీతారాముల వారికి అభిజిత్ లగ్నంలో జీలకర్ర బెల్లం పెట్టడంతో పెళ్లి ప్రధాన ఘట్టం పూర్తయ్యింది. తర్వాత రాములవారు సీతమ్మ మెడలో మాంగల్యధారణ చేశారు. సంప్రదాయంగా పూబంతి ఆటను చేపట్టిన తర్వాత తలంబ్రాల ప్రక్రియ చేపట్టారు. వివాహ ఘట్టం ముగిసిన తర్వాత శ్రీసీతారామచంద్రుల ఉత్సవ కల్యాణమూర్తులు ఊరేగింపుగా గర్భాలయానికి రాగా ఆరాధన, మంగళాశాసనములు జరిపించారు. అర్చనలు, హోమం జరిపిన తర్వాత స్వామి సూర్యచంద్రప్రభ వాహనంపై ఊరేగారు. కాగా గురవారం మహా పట్ట్భాషేకాన్ని నిర్వహించనున్నారు. ముఖ్య అతిధిగా తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ దంపతులు హాజరవుతున్నారు. ఈ వైభవాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. కేంద్ర సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ట్రైకార్ ఛైర్మన్ తాటి వెంకటేశ్వర్లు, డీజీపీ అనురాగ్‌శర్మ, ముఖ్యమంత్రి సతీమణి శోభ, మనువడు హిమాన్షు, దైవజ్ఞశర్మ తదితరులు కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించారు.
అనారోగ్యంతో సిఎం గైర్హాజరు
శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణానికి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు ముఖ్యమంత్రి ప్రభుత్వం తరుపున సమర్పించడం ఆనవాయితీ. కొన్ని సందర్భాలు, ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ముఖ్యమంత్రులు ఈ ఆనవాయితీని తప్పారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాతృవియోగంతో ఆయన భద్రాచలం నవమి వేడుకలకు రాలేకపోయారు. ఈసారి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనారోగ్య సమస్యలతో సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవానికి రాలేకపోయారు.

చిత్రం... సీతారాముల కల్యాణ క్రతువు,
పట్టువస్త్రాలతో వస్తున్న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి