తెలంగాణ

గోదావరిలో ఈతకు వెళ్ళి ఇద్దరు గల్లంతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహదేవపూర్, మార్చి 25: సరదాగా ఈతకు వెళ్ళి మృత్యు ఒడిలోకి జారుకున్నారు. కరీంనగర్ జిల్లా మహాదేవపూర్ మండలం లోతట్టు ప్రాంతమైన సర్వాయిపేట సమీపంలోని గోదావరి నది పారకంలో ఈతకు వెళ్ళిన మెగా కంపెనీకి చెందిన ఇంజనీర్‌తో సహా సైట్ సూపర్‌వైజర్ ఇద్దరు గల్లంతు కాగా శుక్రవారం మధ్యాహ్నం వారి మృతదేహాలు లభించాయి. ఈ సంఘటనకు సంబంధించి కాటారం సిఐ సదన్‌కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారంగా.. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా లింగంపాలెం మండలం బదరాలికి చెందిన కంభంపాటి శివకుమార్ (22), వరంగల్ జిల్లా మామునూరు ప్రాంతానికి చెందిన కంజర్ల రవి కుమార్ (23)తో పాటు మహబూబ్‌నగర్‌కు చెందిన రాచినీల నవీన్ (21) ఈత కోసం మహదేవపూర్ మండలంలోని సర్వాయిపేట వద్ద గల గోదావరి నదికి వెళ్ళారు. గోదావరి నదిలో బండలు, సుడులు ఉన్న విషయం తెలియని వీరు నదిలోకి ఈతకోసం దిగారు. కాగా, శివకుమార్, రవికుమార్ గోదావరి నదిలో ఈత కొడుతుండగా అకస్మాత్తుగా ఊబిలో కూరుకుపోయారని ప్రత్యక్ష సాక్షి, ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డ రాచినీల నవీన్ శుక్రవారం తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం మృతదేహాలు లభించ డంతో మహదేవపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి శవ పంచనామాకై తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.