తెలంగాణ

రాజన్న ఆలయంలో వైభవంగా శివకల్యాణోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేములవాడ, మార్చి 25: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవాలయంలో శుక్రవారం శివకల్యాణోత్సవాలు వైభవంగా ప్రారంభించారు. ఆలయ స్థానాచార్యులు గోపన్నగారి శంకరయ్య ఆధ్వర్యంలో ఉ. 7.35 గంటల నుండి శివభగవత్సుణ్యాహవాచనం, పంచగవ్య మిశ్రణం, దీక్షాధారణం, ఋత్విక్‌వరణం, మంటప ప్రతిష్ట, గౌరీ షోడశమాతృకా ప్రతిష్ట, నవ గ్రహ ప్రతిష్ట, వాస్తు ప్రతిష్ట, మృత్సంగ్రహణం, అంకురార్పణం, సోమకుంభ కలశ ప్రతిష్ట, వాస్తు హోమం, కుండ సంస్కారం, అగ్ని ప్రతిష్ట తదితర ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం శ్రీస్వామివారికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, వేద పారాయణాలు, పరివార దేవతార్చనలు జరిగాయి, సాయంత్రం 4 గంటలకు శ్రీ శివపురాణ ప్రవచనం, రాత్రి 7 గంటలకు భేరిపూజ, దేవతాహ్వానం, నీరాజనం, తీర్థప్రసాద వితరణలు గావించారు. ఆలయ ఇవో దూస రాజేశ్వర్ స్వామివారలకు పట్టువస్త్రాలు సమర్పించారు. శనివారం 10.30 గంటలకు శ్రీ పార్వతీ రాజరాజేశ్వరస్వామి దివ్య కళ్యాణోత్సవం అభిజిత్ లగ్న సుమూహుర్తాన జరగనున్నట్లు ఇవో రాజేశ్వర్ తెలిపారు.
ఎంపి మురళీమోహన్ పూజలు
వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవాలయాన్ని రాజమండ్రి ఎంపి, సినీ నటుడు మురళీ మోహన్ శుక్రవారం సందర్శించారు. ఆయన ఆలయంలో రాగానే ఇవో రాజేశ్వర్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అంతరాలయంలో కొలువుదీరిన శ్రీ పార్వతీ రాజరాజేశ్వరస్వామివార్లకు ప్రత్యేక పూజలు చేసుకొని దర్శించుకున్నారు. కళ్యాణ మండపంలో అర్చకులు ఆయన్ను ఆశీర్వదించగా ఇవో రాజేశ్వర్ స్వామివారి ప్రసాదాలను అందజేశారు.