తెలంగాణ

రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మపురి, ఏప్రిల్ 22: జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం రాయపట్నం గ్రామ శివారులో మూల మలుపు వద్ద ద్విచక్రవాహనం అదుపు తప్పి, దానిపై ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. బుగ్గారం మండలం బీరుసానికి చెందిన సూరుమల్ల హరీష్ (29), కురుమట్ల మధుకర్ (18), కాంపెల్లి మహేశ్ (22), కస్తూరి సాయి (10) అనే వ్యక్తులు ఎపి 15 ఎఎఫ్ 8338నెంబరుగల హీరోహోండా ద్విచక్రవాహనంపై శనివారం రాత్రి వెల్గటూరు నుండి రాయపట్నం వైపు వస్తుండగా మూల మలుపు వద్ద వాహనం అదుపు తప్పి రోడ్డు దిగి చెట్టును ఢీకొనగా, నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ధర్మపురి ఎస్‌ఐ రామకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకుని, శవ పంచనామా నిర్వహించి, కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.