ఆంధ్రప్రదేశ్‌

రైలులో దోపిడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుప్పం, ఏప్రిల్ 23: ఆంధ్ర, తమిళనాడు రాష్ట్రాల సరిహద్దులోని కొత్తూరు గ్రామం వద్ద శనివారం అర్ధరాత్రి రైలులో దోపిడీ జరిగింది. తమిళనాడు రైల్వే పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బెంగళూరు నుంచి కుప్పం మీదుగా చెన్నై వెళ్లే రైలులో అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో ఆంధ్ర, తమిళనాడు సరిహద్దులోని కొత్తూరు-హోసూరు గ్రామాల మధ్య అదే రైలులో ప్రయాణిస్తున్న దుండగులు చైను లాగి రైలును ఆపేశారు. ఏసీ బోగీలో మారణాయుధాలతో ప్రయాణించిన వారు తోటి ప్రయాణికులను బెదిరించి సుమారు 25 సవర్ల బంగారు నగలు, నగదు, మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు దోచుకెళ్లారు. ఈ విషయం తెలిసిన వెంటనే తమిళనాడు రాష్ట్రం చెన్నై జిఆర్‌పి ఎస్‌ఐ విద్య హుటాహుటిన సంఘటన ప్రదేశానికి చేరుకుని విచారణ చేపట్టారు. అంతేకాకుండా జోలార్‌పేట, కర్ణాటక రాష్ట్రం బంగారుపేట్ ఆర్‌పిఎఫ్, కుప్పం జిఆర్‌పి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. 229/700-800 మధ్యలో సంఘటన జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రయాణికుల ఫిర్యాదు మేరకు జోలార్‌పేట పోలీసులు విచారణ వేగవంతం చేస్తున్నారు.