తెలంగాణ

వేములవాడలో వైభవంగా పార్వతీ రాజరాజేశ్వరుల కళ్యాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేములవాడ, మార్చి 26: కరీంనగర్ జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో శ్రీ పార్వతీ రాజరాజేశ్వరుల దివ్యకళ్యాణం శనివారం అత్యంత వైభవోపేతంగా జరిగింది. అభిజిత్‌లగ్న సుముహూర్తంలో శనివారం ఉదయం 10.30 గంటలకు కళ్యాణతంతును ఆలయ అర్చకులు ప్రారంభించారు. పార్వతీదేవి నొసటన కల్యాణ బొట్టును, బుగ్గన కాసింత దిష్టిచుక్కను పెట్టకుని ఆలయ అధికారులు సమర్పించిన పట్టువస్త్రాలను ధరించి పార్వతీదేవి పెళ్లికూతురైంది. కల్యాణ ఘడియ కోసం భక్తులు ఒళ్ళంతా కళ్లు చేసుకొని ఎదురుచూశారు. అనుకున్న సమయం రానే వచ్చింది. శివపార్వతుల శూలాలు, భక్తుల జయజయధ్వనుల మధ్య అభిజిత్‌లగ్నంలో శ్రీ పార్వతీదేవిని శ్రీ రాజరాజేశ్వరస్వామి వైభవోపేతంగా పరిణయమాడాడు. ఒకవైపు స్వామివారి దివ్యకల్యాణ తంతు ఇలా జరుగుతుంటే మరోవైపు శివపార్వతులు నెత్తిపై జీలకర్ర, బెల్లం, పెట్టుకుని లాలు ఊపుతూ శివుడిని వివాహం చేసుకున్నారు. ఉత్సవమూర్తులపై తలంబ్రాలు పడుతుంటే శివపార్వతులు కూడా తమ శిరస్సుపై అక్షింతలను చల్లుకున్నారు. యాభైవేలకు పైగా భక్తులు, శివపార్వతులు దివ్యకల్యాణాన్ని తిలకించారు. అర్చకులు గాలి శ్రీనివాస్ రాజేశ్వరి దంపతులు కన్యాదాతలుగా వ్యవహరించారు.ఈ కార్యక్రమంలో ఇవో రాజేశ్వర్, నగర పంచాయతీ చైర్మన్ నామాల ఉమాలక్ష్మిరాజం, వైస్‌చైర్మన్ ప్రతాప రామకృష్ణ, పాల్గొన్నారు.

చిత్రం వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో
వైభవంగా జరిగిన పార్వతీ రాజరాజేశ్వరుల కళ్యాణం