తెలంగాణ

సభ పేరిట వంద కోట్లు వసూలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 27: తెలంగాణ రాష్ట్ర సమితి వరంగల్‌లో ఏర్పాటు చేసిన సభకు రూ. 100 కోట్లు వసూలు చేశారని, మంత్రుల అక్రమ వసూళ్లపై సిబిఐ చేత విచారణ జరిపించాలని టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం టిడిపి కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉస్మానియా యూనివర్శిటీ శతాబ్ది ఉత్సవాలలో విద్యార్థులు కెసిఆర్ గొంతునొక్కి మదమణిచారని, ఇది తెలంగాణ సమాజంలో కెసిఆర్‌పై పెరిగిన వ్యతిరేకతకు నిదర్శనమని రేవంత్‌రెడ్డి అన్నారు. టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి మూడేళ్ల కాలంలో ఏం సాధించిందని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన 1569 మంది అమరవీరుల కుటుంబాలకు ఇళ్లు, ఉద్యోగాలు ఇస్తామన్న కెసిఆర్ ఎంత మందికి ఇచ్చారో తెలపాలన్నారు.