తెలంగాణ

ఫారెస్టు అధికారుల దాడులపై విచారణకు ఆదేశించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 27: భూపాలపల్లి జిల్లా గోవిందరావుపేట పరిధిలోని దేవునిగుట్టలోని ప్రభుత్వం భూమిలో పాతికేళ్లుగా వ్యవసాయం చేసుకుని జీవిస్తున్న తమపై ఫారెస్టు అధికారులు అకారణంగా దాడి చేసి తీవ్రంగా గాయపరచారని, విచారణకు ఆదేశించి తమకు న్యాయం చేయాలని కోరుతూ గిరిజన తెగ గొత్తి కోయలు గురువారం రాష్ట్ర మానవ హక్కుల సంఘానికి విజ్ఞప్తి చేసింది. ఆలిండియా లాయర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కె పార్థసారథి, సిపిఐ (ఎం) భూపాలపల్లి జిల్లా కార్యదర్శి సూడి కృష్ణారెడ్డితోపాటు పలువురు బాధితులు రాష్ట్ర మానవ హక్కుల చైర్మన్‌ను కలిశారు. తమపై దాడికి పాల్పడిన అధికారులపై చర్య తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు హెచ్చార్సీ భూపాలపల్లి డిఎఫ్‌ఓ, కలెక్టర్‌కు నోట్‌ఫైల్ చేశారు. గత 25 ఏళ్లుగా నివాసముంటున్న తమను ఖాళీ చేయాల్సిందిగా ఎలాంటి హెచ్చరికలు లేకుండానే ఈనెల 21న ఫారెస్టు అధికారులు కుటుంబాలపై దాడి చేసి ఇష్టానుసారంగా కొట్టారని వారు ఆరోపించారు.